Posts

Showing posts from November, 2024

పోలి పాడ్యమి పూజా సమయం

Image
  పోలి స్వర్గం                     స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో 'పోలి స్వర్గం నోము స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో 'పోలి స్వర్గం నోము'ఒకటి.  పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది.  ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ... ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది. ఇక కథలోకి వెళితే ...  ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు.  ఆ అయిదుగు కోడళ్లలో చివరిది ... చిన్నది అయిన కోడలే 'పోలమ్మ'.  చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది.  పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.  కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి, పూజలు చేయడానికి... అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణ...

ఈరోజు పంచాంగం ( 1-12-2024 ) - నేటి విశేషం

Image
  🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏         🍁 పంచాంగం 🍁 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ    ... 01 - 12 - 2024, వారం ...  భానువాసరే ( ఆదివారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళ పక్షం, తిథి      :  అమావాస్య ఉ11.01 వరకు, నక్షత్రం  :  అనూరాధ మ2.26 వరకు, యోగం :  సుకర్మ సా5.20 వరకు, కరణం  :  నాగవం ఉ11.01 వరకు,                 తదుపరి కింస్తుఘ్నం రా11.29 వరకు, వర్జ్యం                  :  రా8.21 - 10.03, దుర్ముహూర్తము  :  మ3.51 - 4.35, అమృతకాలం     :  లేదు, రాహుకాలం        :  సా4.30 - 6.00, యమగండం       :  మ12.00 - 1.30, సూర్యరాశి          :  వృశ్చికం, చంద్రరాశి            :  వృశ్చికం, సూర్యోదయం     :  6.17, సూర్యాస్తమయం:...

శివాలయాలు విశేషాలు

Image
  🙏 ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ క్షేత్రం🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌸పంచకేదార్ దేవాలయాల్లో ఒకటైన ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ఎతైన శివదేవాలయం. ఈ దేవాలయాన్ని వేసవి కాలంలోమాత్రమే చూడగలం. దైవ దర్శనం వల్ల చాలా కాలంగా జరగక ఆగినపనులన్నీ జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. 🌿అందువల్లే అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా లెక్కచేయకుండా ఆ దేవదేవుడి దర్శనానికి వెలుతుంటారు. ఈ క్రమంలో కౄరమృగాలుఎదురైనా లెక్కచేయరు. ఇక చలికాలంలో ఆ దేవాలయంలోని గర్భగుడి మొత్తం మంచుతో మూసుకుపోతుంది. 🌸అందువల్లే ఆ దేవదేవుడి ఉత్సవ విగ్రహాన్ని దగ్గర్లోని మఠానికి తరలించి అక్కడ నిత్య పూజలుచేస్తారు. తిరిగి వేసవి రాగానే ఆ ఆలయ గర్భగుడి ద్వారాలు తెరుచుకొంటాయి. 🌿పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయం కేదర్నాథ్ దేవాలయం కంటే అత్యంత ఎత్తులో ఉండటం గమనార్హం. ఈదేవాలయంలోని ఆ పరమశివుడి దర్శనానికి ఒంటరిగా కంటే బృందాలుగా వెల్లడమేమేలు. 🌸ప్రపంచంలో అత్యంత ఎతైన ప్రదేశంలో ఉన్న దేవాలయం తుంగనాథ దేవాలయం. ఇది మన భారత దేశంలోనే ఉంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేవలం వేసవి కాలంలో మాత్రమే వీలవుతుంది. 🌿ఆ సమయంలో పరిసర ప్రాంతాలు హరనామ స్మరణతో మా...

కర్మకి అతీతులు ఎవరు.?

Image
  కర్మను ఎవరు నిర్ధేశిస్తారు, కర్మ ప్రారబ్ధవశం కర్మను ఆచరించటమే కర్తవ్యం. పరమశివుడికి ఏమికర్మ ఉందని దక్షునితో అవమానం జరిగింది. భర్తకు జరిగిన అపచారానికి జగన్మాత ఏమి కర్మ ఉందని యోగాగ్నిలో భస్మం అయ్యింది. సీతమ్మవారికి ఏమి కర్మ ఉందని కష్టాలు వచ్చాయి. పరమోత్తములు శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడికి ఏమి కర్మ ఉందని రాక్షస సంహారం చేశారు. ఆదిశేషుని అవతార మూర్తి అయిన లక్ష్మణుడు నాగాస్త్రం ధాటికి ఎలా ఒరిగాడు. యోగం-కరణం అనేవాటి ద్వారా సీతాపహరణ, తిరిగి ఏడాది తర్వాత చేరుకుంటారని సంపాతి రామునకు కర్మ వైశిష్ట్యాన్ని వివరించాడు. కర్మ శరీరానికి తప్పని విధి. దాన్ని ధర్మబద్ధంగా ఆచరించటమే మనందరికి యోగం-క్షేమం. పురాణాలు కధలు కావు, చరిత్ర యని  మనము గమనించుకోవాలి. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

శివయ్య పర్వతమ్మాలు మహాలక్ష్మి ప్రసన్నం ఎలా చేసుకున్నారు.?

Image
  ❤ #వందేశంభు ముమాపతిం సురగురుంవందే జగత్కారణం వందేపన్నగభూషణం మృగధరంవందే పశూనాంపతిం వందేసూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందేభక్త జనాశ్రయంచవరదం వందేశివం శంకరం!! ♦ఉమాపతి జగత్కారణుడు పన్నగభూషణుడు సూర్యచంద్రఅగ్నులు కళ్ళుగలశివునికి వందనం 🚩😗శివుడికి జలుబు చేసింది! నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా.  కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤 నెల రోజుల బట్టి మొత్తుకుంటున్నా! చెబితే విన్నారు కాదు. ఏదిబడితే అది. పండా, కాయా, రేషన్ చెక్కరా, కల్తీ తేనె....ఏమీ చూడకుండా.. అభిషేకాలు చేయించుకున్నారు. ఇప్పుడు అవస్థ పడుతున్నారు..🤨😙 పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌 "భక్తులు ప్రేమతో కాదు. TV ఛానెళ్లల్లో ఏది చెబితే అది పోస్తున్నారు. వింటుంటే నాకే భయమేస్తుంది. ఒక్కొక్క పండుకి ఒక బెనిఫిట్ ఇస్తారట గా మీరు? నవ్వుతూ అంది అమ్మవారు. " నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు.  భక్తి తో నన్ను తలుచుకుంటే చాలు.  ఈ స్కీం లు నావి కావు....

ఆలయం ఆగమం

Image
  ఆలయం ఆగమం ఆలయ విమానం పైభాగంలో కనిపించే కలశంలాంటి నిర్మాణాన్నే ఆగమ, శిల్పశాస్త్ర పరిభాషలో స్తూపిక అంటారు. చాలామంది శిఖర కలశం అని పిలుస్తారు. ఆలయంలో ఇది అంతిమభాగం, అతి ముఖ్యమైన భాగమని సంప్రదాయం చెప్తోంది. ఆలయంలోనికి అనంతశక్తిని ప్రసరింపజేయడంలో ఈ స్తూపిక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆలయానికి బ్రహ్మభాగంలో అంటే నట్టనడిమిన ఇది ప్రతిష్ఠించబడుతుంది. ఇందులో అమృతం నిండి ఉంటుంది. అందుకే ఇది బిందుస్థానం(మధ్యభాగం)లో ఉండి నిరంతరం అమృతాన్ని స్రవిస్తుందని విశ్వకర్మీయ శిల్పశాస్త్రం చెప్పింది. ఆలయానికి శ్రీయంత్రానికి (శ్రీచక్రం) అవినాభావ సంబంధం ఉంది. ఈ యంత్రం నుండి పైకి లేచి ఆలయం రూపు దాలిస్తే సరిగ్గా బిందుస్థానంలో స్తూపి ఉంటుంది. బిందువు శక్తి అంశ. అందుకే ఈ స్తూపి అత్యంత శక్తివంతమైనది. సాధారణంగా స్తూపిని అరటిమొగ్గవలె రూపొందిస్తారు. అయితే కొన్ని చోట్ల త్రిశూలం, చక్రం వంటి లాంఛనాలు కూడా కనిపిస్తాయి. మొగ్గ వికసించని సృష్టికి ప్రతీక. అంటే ఇక్కడే సృష్టి ప్రారంభం అవుతోందని గమనించాలి. బిందువు నుండి ప్రారంభమై క్రమక్రమంగా విస్తరిస్తూ ఆలయం పూర్ణాకృతి పొందుతుంది. ఇది అవరోహణక్రమం. పూర్ణదేవాలయం క్రమ క్రమేపి చిన...

పిల్లలు పుట్టటానికి సంకటహర చతుర్థి వ్రతం

Image
సాధారణంగా చాలా మందికి వివాహమైన పిల్లలు కలగకపోవడంతో ఎన్నో బాధలు పడుతుంటారు.ఈ విధంగా సంతానం కలగడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరికి పిల్లలు కలగక పోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.అదేవిధంగా సంతానం కలగని వారికి, అదేవిధంగా పుత్ర సంతానం కావాలని కోరుకునే వారు తప్పకుండా సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తే తప్పకుండా పుత్రసంతానం కలుగుతారని గణపతి పురాణంలో తెలియజేయడమైనది. పుత్ర సంతానం కలగాలంటే.. ఈ వ్రతం ఆచరించాలి. గణపతి పురాణం ప్రకారం పూర్వం కృతవీరుడు అనే మహారాజుకి ఎంతో అందమైన భార్య ఉండేది.అదేవిధంగా కృతవీరుడు ఎన్నో భోగభాగ్యాలు అనుభవిస్తూ దానధర్మాలు చేస్తూ, ఎల్లప్పుడు ప్రజా సేవ చేస్తూ ఉండేవాడు. అయితే కృత వీరుడిని నిత్యం ఒక సమస్య వెంటాడేది.అతనికి పిల్లలు కలగకపోవడం అతనిని తీవ్ర నిరాశ పరిచింది. సంతానం కోసం వారు చేయని పూజలు లేవు.అయితే ఒకరోజు తనకు సంతానం కలిగే ఉపాయాన్ని తెలియజేయమని కృతవీరుడు నారదుని సలహా అడుగుతాడు. పిల్లలు పుట్టటానికి సంకటహర చతుర్థి వ్రతం   నారదుడు తగిన ఉపాయం వెతుకుతూ కృత వీరుడి పితృ లోకాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కృతవీరుడు తండ్రి, తాత,ముత్తాతలు నరక బాధలను అను...

అదృష్టం-ఐశ్వర్యము - Astro Remedies

Image
  అదృష్టం-ఐశ్వర్యము  ప్రతి ఒక్కరూ స్నానం చేసే సమయంలో సరైన పద్ధతులు పాటిస్తే అదృష్టము అదేవిధంగా ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది.తలస్నానము,తలంటుస్నానం అని రెండు రకాలుగా ఉంటాయి.తలమీద మామూలుగా నీటిని పోసుకుంటే దాని తల స్నానం అంటారు.అలాకాకుండా ఒంటికి నువ్వుల నూనె రాసుకుని,తలకి నూనె రాసుకుని షాంపూతో కానీ కుంకుడు కాయతో కాని తల స్నానం చేస్తే దానిని తలంటు స్నానం అంటారు. ఆడవాళ్ళ ప్రతిరోజు తలస్నానం చేయరాదు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఆడవాళ్ళు తలస్నానం చేయవచ్చు.ఆడవాళ్లు సాధారణంగా కంఠస్నానం చేయాలి.శుక్రవారం అయితే తలంటు స్నానం చేయవచ్చు,లేదా తలస్నానం అయినా చేయవచ్చు.వివాహం అయిన మగవాళ్ళుప్రతిరోజు తలస్నానం చేయడం మంచిది అలా చేస్తే పూజా ఫలితం పెరుగుతుంది.మగ వాళ్ళు సోమవారం, బుధవారం, శనివారం తలంటు స్నానం చేయడం వలన అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా బుధవారంనాడు తలంటు స్నానం చేస్తే  అద్భుతమైన ఫలితాలను చూడవచ్చును అదృష్టం బాగా కలిసి వస్తుంది.ఆదివారం ఎటువంటి పరిస్థితులలోనూ కూడా తలంటు స్నానం చేయరాదు అలా చేస్తే మొత్తం అదృష్టం అంతా పోతుంది,ధననష్టము ఆరోగ్య నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.ఆడవాళ్లు మంగళసూత...

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సందేశం

Image
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సందేశం   "ఇతరుల కష్టసుఖాలను పంచుకునే అలవాటు చేసుకో, కాని ఇంకొకరు పచ్చగా వుంటే చూసి ఓర్వలేక పోవటం నేర్చుకోవద్దు. ఇతరులకు ఏవైనా ప్రైజులు, అవార్డులు వస్తే సంతోషించు. వాటిని వారేలా కష్టపడి సాధించారో చూసి నేర్చుకో. వారిలాగా నీకూ తెలివి తేటలూ, శ్రమ పడే శక్తి, మంచి జ్ఞాపక శక్తి ప్రసాదించుమని దేవుణ్ణి ప్రార్థించు. కానీ వారిని చూసి అసూయ పడకు. అసూయ మహా విషం. అది నీ నడవడికి మచ్చ తెస్తుంది. ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. శాంతి లేకుండా చేస్తుంది. అందుకే "అనసూయవు"కా త్రిమూర్తులను పసిపాపల్లా ఆడించగలుగు తావు. అంతేకాని చిన్న, చిన్న విషయాలలో కూడా అసూయ బారిన పడకుండా జాగ్రత్త పడు."  జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోతారా.??

Image
  దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోరు .  నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు.  భక్తి ఉన్నవాడు పాపం చేయడు, చేయలేడు.  ఎందుకంటే  దైవం ధర్మప్రియుడు. ధర్మాన్ని తప్పితే భక్తి అనిపించుకోదు.  భక్తికి ధర్మం ప్రాణం.  గుళ్ళూ గోపురాలు తిరిగేవారు,  దేవుడి పూజలు చేసేవారందరూ భక్తులేనని చెప్పడానికి లేదు. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు,  అలా కొందరు దేవుడ్ని కొలుచుకొంటారు. వారికి దేవుడి పట్ల అసలైన శ్రద్ధ ఉండదు.  వారందరినీ 'భక్తులు' అనే వర్గం క్రింద జమకట్టకూడదు. అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని వాడుకొని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఉంటారు. వారినే భక్తులనుకోవడం పొరపాటు.  పాపం ఉన్నచోట భక్తి పండదు. దైవశక్తి జాగృతం కాదు. దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవత్వం పట్ల ఆసక్తి ఉండదు. భక్తుడు భగవంతుని నామ, గుణ మహిమల పట్ల ప్రేమ కలిగి,  నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు.  నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం,...

కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం

Image
🙏కృష్ణనామ స్మరణం కలిదోష నాశనం.🙏 శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు.  కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు.  పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది. మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట. భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణ వచనం.  పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా!  కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది. కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడ...

ప్రదోష వ్రతం

Image
  ప్రదోష వ్రతం (శివపూజ) : సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అంటారు. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతి...

కార్తీక దీపము ఎప్పుడు నీటిలో వదలాలి? పోలి పాడ్యమి ఎప్పుడు??

Image
  కార్తీక దీపము ఎప్పుడు నీటిలో వదలాలి? పోలి పాడ్యమి ఎప్పుడు? 🙏నవంబరు 30 ఉదయం 9-33నుండి డిశంబర్ 1తేదీ ఉదయం 11-00 గంటల  వరకు అమావాశ్య ఉన్నది. అంటే 30తేదీ రాత్రి అమావాస్య ఉన్నది 1తేదీ ఆదివారం రాత్రి  అమావాస్య లేదు కనుక కార్తీక దీపాలు నవంబర్ 30తేదీ రాత్రి అందరూ కార్తీక దీపాలు అరటి దుప్పులలో ఉంచి నీటిలో దీపాలు వదలాలి. లేదా 2తేదీ పోలిపాడ్యమి, పోలి (స్వర్గానికి వెళ్లిన రోజు) కనుక 2తేదీ సూర్యుడు ఉదయించక ముందే తెల్లవారు జామున అనగా 1తేదీ తెల్లవారు జామున పొలిని తలుచుకుని కార్తీక  దీపాలు నీటిలో వదలాలి. పోలి కూడా ఆనాడు కార్తీక అమావాస్య రోజు దీపారాధన కుందులు లేకపోవడం వల్ల పెరటి లోని అరటి చెట్టు నుండి తీసిన అరటి దుప్పులో  పిండితో దీపారాధన కుంది చేసి కవ్వమునకు ఉన్న వెన్నను కరగ పెట్టి ఆనేతితో దీపారాధన చేసి అమావాశ్య రోజు నీటిలో వదిలింది. అందుకే కార్తీక అమావాశ్య రోజునదులు,కొనేరులు,సరస్సులుమొదలైన చోట నీటిలో దీపాలు వదలాలి. అవకాశం లేకుంటే ఇంట్లొ వుండే ఇత్తడి డీసు అదిలేకుంటే మట్టి పాత్రలో నీటిని నింపి  తులసి కోట వద్ద దీపము వదిలి పెట్టవలెను. ఈమధ్య కొంతమంది అతితెలివి తేటలు కలిగిన ...

పంచాంగం ( 28-11-2024 ) - Today Panchangam

Image
  🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏         🥀పంచాంగం🥀 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ    ... 28 - 11 - 2024, వారం ...  బృహస్పతివాసరే ( గురువారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళ పక్షం, తిథి      :  త్రయోదశి పూర్తి, నక్షత్రం  :  చిత్ర ఉ7.50 వరకు, యోగం :  సౌభాగ్యం సా4.56 వరకు, కరణం  :  గరజి సా6.45 వరకు, వర్జ్యం                :  మ2.01 - 3.47, దుర్ముహూర్తము :  ఉ9.57 - 10.41,                               మరల మ2.22 - 3.07, అమృతకాలం     :  రా12.37 - 2.23, రాహుకాలం        :  మ1.30 - 3.00, యమగండం       :  ఉ6.00 - 7.30, సూర్యరాశి          :  వృశ్చికం, చంద్రరాశి            :  తుల, సూర్యోదయం     :  6....

పితృదేవతల కోసం మొక్కలు - Remedies

Image
  పితృదేవతల కోసం మొక్కలు మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో అగస్త్య మహర్షి ఇలా అంటారు.  ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం.  వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం.  ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది.  మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది.  సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి.  కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతు...

పంచాంగం ( 27-11-2024 ) - Today Panchangam

Image
 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏         🌺 పంచాంగం 🌺 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ     ... 27 - 11 - 2024, వారం  ...  సౌమ్యవాసరే ( బుధవారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, బహుళ పక్షం, తిథి      :  ద్వాదశి తె5.41 వరకు, నక్షత్రం  :  చిత్ర పూర్తి, యోగం :  ఆయుష్మాన్ సా4.25 వరకు, కరణం  :  కౌలువ సా4.36 వరకు                తదుపరి తైతుల తె5.41 వరకు, వర్జ్యం                 :  మ2.04 - 3.51, దుర్ముహూర్తము  :  ఉ11.25 - 12.09, అమృతకాలం     :  రా12.43 - 2.29, రాహుకాలం        :  మ12.00 - 1.30, యమగండం       :  ఉ7.30 - 9.00, సూర్యరాశి          :  వృశ్చికం, చంద్రరాశి            :  కన్య, సూర్యోదయం     :  6.15, సూర్యాస్తమయం:...

కార్తీక పురాణం - 25 వ అధ్యాయము

Image
  కార్తీక పురాణం -                    25 వ అధ్యాయము                   దూర్వాసుడు అంబరీషుని శపించుట! “అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము” అని పండితులు పలికిరి.  అంత అంబరీషుడు “ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును” అని వారి యెదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముననే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను.  వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ “ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము?...

ధర్మో రక్షతి రక్షితః అంటే.??

Image
  ధర్మో రక్షతి రక్షితః                జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహత్కార్యం మరొకటి లేదు. మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేదీ ధర్మమే. ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడటమంటే- అన్నివేళలా ధర్మాన్నే ఆచరించాలి. ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి చెబుతోంది. శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి   శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అంటాడు. అంటే మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యదైవమయ్యాడు. మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో విపులంగా వివరించి చెప్పింది మహాభారతం. ఏ కర్మలైతే మనోవాక్కాయాలకు బాధ కలిగిస్తాయో ఆ విపరీత కర్మలను ఇతరుల విషయంలో ఆచరించకూడదు. అందుకే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ చెబుతాడు. వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పినవాటిని అర్ధ...