Posts

Showing posts from July, 2024

కామిక ఏకాదశి(బుధవారం 31 జులై 2024)

Image
 కామిక ఏకాదశి  పూజా విధానం...... తెల్లవారుజాము నుంచి ఉపవాసము..ఫలాలు, పాలు స్వీకరించవచ్చు. మీకు వీలైనంత ఎక్కువగా భగవన్నామ స్మరణ, కుదిరిన వారు మహా మంత్రజపము (వారి వారి ఉపదేశానుసారం/కుల దేవతా పూజాదికాలు) రామాయణ,భారత, భగవద్గీత, భాగవతము ఎక్కువ సమయము చదవగలరు. ఉపవాసం చేసినా చేయకపోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి. 26 ఏకాదశి నామములు :- 1 పాపమోచని ఏకాదశి 2.కామాదా  ఏకాదశి 3.వరూధిని ఏకాదశి 4.మోహినీ ఏకాదశి 5.అపర ఏకాదశి 6.పాండవ నిర్జల ఏకాదశి 7.యోగిని ఏకాదశి 8.శయన ఏకాదశి 9.కామిక ఏకాదశి 10.పవిత్రోపన ఏకాదశి 11.అన్నదా ఏకాదశి 12.పార్శ్వ ఏకాదశి 13.ఇందిరా ఏకాదశి  14.పాశాంకుశ ఏకాదశి   15. రమా ఏకాదశి   16.ఉత్థాన ఏకాదశి               17.ఉత్పన్న ఏకాదశి 18.మోక్షదా ఏకాదశి 19.సఫల ఏకాదశి  20.పుత్రదా ఏకాదశి                21.షట్తిల ఏకాదశి  22.భైమి ఏకాదశి  23.విజయ ఏకాదశి 24.ఆమలకి ఏకాదశి  25. పరమ ఏకాదశి          26. పద్మిని ఏకాద...

**** హాసనాంబ దేవాలయం**** ఈ దేవత ముందు పెట్టిన అన్నం ఏడాదైనా చెడిపోదు……!!!

Image
ఈ దేవాలయానికి ఒకటి కాదు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఈ దేవాలయ భక్తులలో మాజీ ప్రధానుల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఈ దేవాలయం విశిష్టతలు ఏమిటి?… దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకలో హాసన్ అనే చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణంలోని అమ్మవారి పేరే హాసనాంబ. హాస్యం అంటే నవ్వు అని అర్థం. ఇక్కడ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారు. అలా మారిపోయన అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. అందుకు ఉదాహరణకు హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతారు. దీంతో కోపగించుకొన్న హాసనాంబ ఆమెను బండరాయిగా మారిపోమ్మని శపించింది. ఆ బండరాయిని మనం ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో చూడవచ్చు. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచు హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూ ఉంది. ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పలేక పోతున్నారు. ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాం...

జ్యోతిష వివరణలో మూలములు

Image
సంచిత ఆగామి ప్రారబ్ధ ఖర్మలు లో సృష్టి జీవన విధానంలో కొన్ని గ్రహ స్థిత దర్మ అనుసారం జీవి అనేక మజిలీలు జీవన గమనం సాగుతూ కష్ట నష్ట ముల  వ్యధలు, కావిడ మోతగా సాగే జీవన పయనం లో ఎత్తు పల్లాలు ఒడిదుడుకులు అనేకం జ్యోతిష పరంగా సుఖ దుఃఖ బాదితులు గమనిస్తుంటాము . రాశి చక్రము  నవాంశ  అరూడము  శోడశ చక్ర గమనము  కారకాంశ  స్వాంశ  ఇత్యాది వివరణలో ద్రేఖాన స్థితము రాశి 3బాగములలో గ్రహ స్థితము అంత్య ధ్రేఖాన స్థితగ్రహము ఆత్మ అగుచున్నది  లేదా అధిక డిగ్రీ గ్రహము ఆత్మ కారకుడు అమాత్య,బ్రాత,మాతృ,పుత్ర,జ్ఞాతి, దార  కారకులు వరుసగా అగు చున్నారు.  కొన్నిసార్లుఇలాగమనిస్తున్నపుడు వున్న 9 గ్రహాలులో వ్యదా పూరిత గ్రహ దశలులో (బాధక )కొందరు ఆసుఖత కొందరు సుఖ భావన కలిగి కొద్ది రోజులు అటు ఇటుగా సాగే జీవన మజిలీలు గమనిస్తాం.   రాశులు 12 ద్వాదశ రాశులు లో గ్రహాలు దూమ్ర గ్రహములు రాహు కేతువులు మినహా సప్త గ్రహ పాలనలో జరిగే విపరీతములు కొన్ని సార్లు ప్రమాదములు కొన్ని శుభ పరంపరలలో  సంతోష  సుఖ దుఃఖ బాజితులు అగుచూ నడిచే జీవనము మానవ జీవన చక్రం .  సమస్త పాణి జంతు కోటి ఈ చక్ర ...

శ్రీ విధాత పీఠంలో ఆషాఢ అమావాస్య పూజలు

Image
  భగవత్ భందువులందరికిీ నమస్కారం,  04-08-2024 ( గురువారం) ఆషాఢ అమావాస్య  సందర్భంగా శ్రీ విధాత పీఠంలో  గౌరీ పూజ , ప్రత్యంగిర హోమం హవనిజా గారి ఆధ్వర్యంలో  జరగనునది. మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు గౌరీ పూజ   - 116/- ప్రత్యంగిర హోమం -516/- 🙏సర్వేజనా సుఖినో భవంతు🙏 జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 96666 02371

చనిపోయినవారు ఎక్కడికి వెళ్తారు ???

Image
చనిపోయినవారు ఎక్కడికి వెళ్తారు ?  కాశీలో సమస్త విద్యలనూ, శాస్త్రాలనూ అభ్యసించిన మహా పండితుడైన బ్రాహ్మణుడు తన సొంత గ్రామానికి చేరి నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏదో పనిమీద దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళాడు. తిరిగివస్తుండగా పెద్దవాన పడింది. తన వద్ద గొడుగు కూడా లేకపోవడంతో, అతడు దగ్గరలోని ఓ యింటి అరుగుమీదకు వెళ్ళాడు.  అది ఒక వేశ్యయిల్లు. వర్షం తగ్గగానే ఆ యింటి ముందు నుంచి ఒక మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని స్మశానానికి తీసుకెళుతున్నారు.  ఆ వేశ్య తన కుమార్తెను పిలిచి ఆ చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడో, లేక నరకానికి వెళ్ళాడో తెలుసుకుని రమ్మని పంపింది.  ఆ మాటలు విన్న పండితుడు ఆశ్చర్యపోయాడు. మరణించివారు ఎక్కడకు వెడతారో, తెలుసుకునే విద్య గురించి తనకు తెలియలేదే!అని చింతించి, ఆ విషయమేమిటో తెలుసుకునేందుకు మరికొంతసేపు అక్కడే ఉండిపోయాడు.  ఆ అమ్మాయి తిరిగివచ్చి చనిపోయినవ్యక్తి నరకానికి వెళ్ళాడని చెప్పింది. ఇంతలో మరికొందరు యింకో శవాన్ని తీసుకెళ్తుండగా చూసి ఆవేశ్య ఈసారి చనిపోయిన వ్యక్తి ఎక్కడకు వెళ్ళాడో కనుక్కొని రమ్మని కుమార్తెను పంపింది. ఆ అమ్మాయి కనుక్కునివచ్చి ఈ వ్యక్తి స్వర్గ...

!!! జపం ఎలా చెయ్యాలి ???

Image
  జపం ఎలా చెయ్యాలి ? మన ఇష్టదైవం యొక్క నామాన్ని కానీ., మంత్రాన్ని కానీ., ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానాన్నే జపం అంటారు. రోజుకు ఇన్నిసార్లు జపం చెయ్యాలనే సంఖ్యానియమం కూడా ఉంటుంది. ఒకవేళ అనుకోని ఇబ్బందులవల్ల ఆ రోజు జప సంఖ్య పూర్తి చేయలేని పక్షంలో., మరునాడు ఈరోజు మిగిలిన జపసంఖ్యను చేర్చి చేయవలసి ఉంటుంది. జపాన్ని ఏదో మొక్కుబడిగా చెయ్యకూడదు. సంఖ్య పూర్తిచెయ్యడమే ప్రధాన లక్ష్యంగా జపం చెయ్యకూడదు. భక్తి చాలా ప్రధానం. జపం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది. వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధః స్మృతః త్రయాణాం జపయఙ్ఞానాం శ్రేయాన్ స్యాదుత్తరోత్తరమ్ జపం.. వాచికము, ఉపాంశువు, మానసికము అని మూడు విధాలుగా ఉంటుంది. వాచికము: బయటకు వినిపించే విధంగా జపం చేసే పద్ధతిని ‘వాచికము’ అంటారు. ఉపాంశువు: బయటకు వినిపించకుండా, కేవలం పెదవులు కదుపుతూ నాలుకతో జపం చేసే విధానాన్ని ‘ఉపాంశువు’ అంటారు. మానసికము: నాలుక, పెదవులు కదలకుండా మౌనంగా మనస్సు లోలోపలే జపం చేసే విధానాన్ని ‘మానసికము’అంటారు. ఈ మూడింటిలో వాచికము కంటే ఉపాంశువు., ఉపాంశువు కంటే మానసికము మరింత శ్రేష్ఠము అని శాస్త్ర ప్రమాణము. హస్తౌ నాభిసమౌ కృత్వా ప్రాతస్సంధ్యా జ...

గోవిందో... గోవిందో...!!!

Image
భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన రాపూరు: నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన లోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 4 అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగి సేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మ వార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండలపంలో కొలువుదీర్చి కల్యాణం చేశారు.కల్యాణం ని కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు.. సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక ACCANKSHA YEDUR (M.A...

!!! బాలా త్రిపుర సుందరి దేవి అంటే....!!!

Image
త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత. ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మ స్వరూపురాలు, ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ...

!!!!శఠగోపం మహిమ !!!!

Image
శ్రీవైష్ణవాలయాల  దర్శనానికి వెళ్ళినప్పుడు అర్చకస్వాములు తీర్ధం, తులసీ ప్రసాదంగా యిచ్చి అందరి శిరస్సులపై మహావిష్ణువు  పాదుక ముద్రలుండే  శఠగోపాన్ని పెట్టి ఆశీర్వదిస్తారు.  ముకుళిత సస్తాలతో, శిరస్సు వంచి ఆ శఠగోపాన్ని భక్తితో శిరస్సు పై పెట్టించుకోవాలి, మన తలవ్రాతలని మార్చే శక్తి శఠగోపానికి వున్నది. మహావిష్ణువు చరణాలను  ఆశ్రయించి శరణు వేడుకుంటున్నాము అంటే మన శిరస్సును ఆయన పాదలపై పెడుతున్నాము అని అర్ధం.. ప్రత్యక్షంగా శ్రీ మహావిష్ణువు పాదాలపై తలపెట్టే మహాద్భాగ్యం ఏ పుణ్యపురుషులకో తప్ప అందరికీ లభించదు.  కాని భగవంతుని పాదుకల ముద్రలను శఠగోప రూపంలో  పెట్టించుకొని నందువలన మహావిష్ణువు పాదాలే మన శిరస్సుకి తగిలి పాప విముక్తు లవుతున్నామనే పవిత్ర భావన, తృప్తి కలుగుతుంది.  స్వామి వేదాంత దేశికర్ "పాదుకా సహస్రం" అనే అద్భుతమైన గ్రంధం రచించారు. శ్రీ రంగనాధుని పవిత్రచరణాల మహిమలను తెలిపే గ్రంథం యిది. వేదాంతదేశికర్ కి   "కవి తార్కిక కేసరి"   అనే బిరుదును లభింప చేసినది యీ గ్రంధం. ఒకే  రాత్రిలో వ్రాసిన యీ అద్భుత గ్రంధంలో శ్రీ పాదుకల మహిమలే కాకుండా...

???ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి???

Image
ఆడికృత్తిక 30/7/2024, మంగళవారం, సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైన రోజు  ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి ? ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామి పండగ ఆ రోజు కావడి తీసే వారు తీస్తారు అలా కావడి ఉత్సవం చేయలేని వారు. ఉదయం తల స్నానం చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో అలంకరణ చేసి, బియ్యం పిండితో దీపాలు వెలిగించాలి పానకం తో పాటు యధాశక్తిన నైవేద్యం సమర్పించి స్వామికి స్త్రోత్రం అష్టోత్తర పారాయణ చేసి స్కంద షష్ఠి కవచం   పారాయణ చెయ్యవచ్చు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది సుబ్రహ్మణ్యుని కావడి ఎలా ఎత్తాలి ? ఇందులో పాల కావడి పళ్ళ కావడి అని ఉంటుంది ముందుగా కావడి కి కావాల్సిన కర్రలు, (తెల్లజిల్లేడు కర్ర, నేరేడు కర్ర, పాల కర్ర ) ఇలా రకరకాలుగా కర్రలు కంటలు కట్టి అమ్ముతుంటారు ఏదైనా కర్ర తీసుకోవాలి కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజ సామానులు నింపుతారు ఇంకో వైపు మూడు రకాల పండ్లు నింపుతారు , పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు, ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ చేశాక కావడి అందంగా అలంకారం చేసి పూజ చేస్తారు ఇంట్లో భోజనా...

***మైసూరు చాముండేశ్వరి జయంతి ***

Image
నేడు మైసూరు చాముండేశ్వరి దేవి జయంతి. మహిషాసురుడు ఘోరతపస్సు చేసి ఎవరివల్ల చావు లేకుండా బ్రహ్మను వరం కోరాడు. అది సాధ్యం కాదని చెప్పగా స్త్రీ అబల కనుక స్త్రీ తప్ప ఇతరులు చేత చావు లేకుండా కోరి వరం పొందాడు. ప్రజాకంటకుడై, దుష్టపాలన చేసే రాక్షసుడు కనుక జగన్మాత చాముండేశ్వరిగా మహిషాసురుని సంహరించింది. ఒడయారు మహారాజుల కులదైవం చాముండి. ఆషాఢమాసంలో దేశమంతటా దేవీ ఆరాధన విశేషంగా జరుగుతుంది. శక్తిపీఠాలలో ఒకటైన మైసూరు చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో అయితే... ఆషాఢమాసంలోని శుక్రవారాలు, ఆదివారాల్లో భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఆషాఢ బహుళ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా భావిస్తారు. ఆరోజున అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. మైసూరు ప్యాలస్ నుంచి పల్లకీని రప్పిస్తారు. రాజదంపతులు,ముఖ్యులు కూడా పల్లకీ సేవలో తప్పకుండా పాల్గొంటారు. చాముండేశ్వరి జయంతిని అక్కడివారు వర్ధంతిగా పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలు 19వ శతాబ్దంలో ముమ్మిడి కృష్ణరాజ వడయార్ కాలంలో ప్రారంభమయ్యాయని చెబుతారు. ఆయన ఆషాఢమాసంలోని రేవతీ నక్షత్రంనాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారు. ఆ ఉత్సవమూర్తినే చాముండీ వర్థంతినాడు పల్లకిలో ఊరేగిస్తారు. ఈ మూ...

“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం.

Image
మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం. అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం. ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది. ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.           “బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల స...
Image
  భగవత్ భందువులందరికిీ  నమస్కారం, శ్రీ విధాత పీఠంలో 31-07-2024 (  బుధవారం  )  ఏకాదశి  సందర్భంగా అభిషేకం,  సుదర్శన హోమం, విష్ణు సహస్రనామ పారాయణ హవనిజా గారి ఆధ్వర్యంలో  జరగనునది. మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు అభిషేకం                               -116/- విష్ణు సహస్రనామ పారాయణ -116/- సుదర్శన హోమం                - 516/- 🙏సర్వేజనా సుఖినో భవంతు🙏 జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 96666 02371

ని శింగణాపూర్ శనైశ్చరుని అపూర్వ దర్శనం

Image
స్ధలపురాణం ప్రకారం  పూర్వం , ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని , ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిబ్రాంతి చెంది , భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలుపోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను "శనీశ్చరుడి"నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట , ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ , ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని , ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల , దోంగల , దోపిడిదారుల , కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యా...

!!!పురుషులకు ప్రాప్తించే కళత్రదోషం - పరిహారములు!!!

Image
కళత్రం అంటే భార్య అని అర్థం. పురుషుల జన్మకుండలిలో భార్యను గూర్చి తెలియజేసే, ప్రభావితం చేసే గ్రహం శుక్రుడు. శుక్రుడు కళత్ర కారకుడు. పురుషుని జన్మ కుండలిలో సప్తమ స్థానమును కళత్రస్థానం అని పిలుస్తారు. జన్మకుండలిలో సప్తమ భావంలో చెడు గ్రహములు ఉన్నట్లయితే ఆ జాతకులకు కళత్ర దోషం ఏర్పడుతుంది. ఈ కళత్ర దోషం వలన జాతకునికి వివాహం ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా సరైన భార్య దొరకడం దాదాపుగా అసాధ్యం అవుతుంది. ఒక వేళ విధివశాత్తు జాతకునికి వివాహం జరిగినా, వివాహం జరిగిన కొద్ది రోజులలోనే భార్యతో విభేదాలు తలెత్తి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కళత్ర దోషం ఉన్న దంపతులకు సంసార సుఖం లభించదు. మరి కొందరికి కళత్రదోషం ఉన్నవారి జీవితభాగస్వామికి అనారోగ్యాలు కలుగటంగాని, అకాలమరణం పొందటంగాని జరుగుతాయి. ఈ కళత్ర దోషం వలన వివాహం ఆలస్యం కావడం, విచారపూరితమైన దాంపత్య జీవితం ఏర్పడటం, దాంపత్య సుఖం లేకపోవటం, భార్యతో విభేదాలు రావటం, భార్యకు దూరంగా ఉండటం, భార్యతో విడిపోవడం, భార్య అకాలమరణం పొందటం లాంటివి జరుగుతాయి. పురుషుని జన్మకుండలిలో సప్తమస్థానంలో శని ఉంటే జాతకుడికి కళత్రదోషం, శనిదోషం ఏర్పడుతుంది. ఈ శని దోషం వలన జాతకులకు ఆలస్య వివ...

శ్రీ విధాత పీఠంలో ఏకాదశి సందర్భంగా

Image
  భగవత్ భందువులందరికిీ  నమస్కారం, శ్రీ విధాత పీఠంలో 31-07-2024 (  బుధవారం  )  ఏకాదశి  సందర్భంగా అభిషేకం,  సుదర్శన హోమం, విష్ణు సహస్రనామ పారాయణ హవనిజా గారి ఆధ్వర్యంలో  జరగనునది. మీ మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు ఈ క్రింది నెంబరుకు gpay కానీ, phonepay   ద్వారా కానీ పంపగలరు అభిషేకం                               -116/- విష్ణు సహస్రనామ పారాయణ -116/- సుదర్శన హోమం                - 516/- 🙏సర్వేజనా సుఖినో భవంతు🙏 జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 96666 02371  

శాకంబరి దేవి ప్రాశస్త్యం

Image
  అమ్మను చూడటానికి వెయ్యి కళ్ళైనా సరిపోవు, శ్రీ శాకంబరీ దేవి అలంకరణలో మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నిజరూపం శాకంబరి దేవి ప్రాశస్త్యం మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా, అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరి/శాకంభరి దేవిగా అలంకరిస్తారు శాకంబరి దేవి గురించి శ్రీ దేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరీ దేవి ఉత్సవం సందర్భంగా, అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు  పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు ఇందుకు సంబందించిన పురాణ గాధ తెలుసుకుందాం వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్ని మర్చిపొయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తి హీనులైపోయారు. నదీ నదాలు ఎండి పోయాయి. వర్షాలు లేక వృక్ష జాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది ఋషులు, దేవతలు సర్వ శక్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని ప్రార్ధించారు. అప్పుడు ఆ దేవి కరుణతో “శతాక్షి” గా అనేకమైన...

***ప్రారబ్దం***

Image
  ప్రారబ్దం అంటే ఏమిటి - దీనిని వదిలించు కునే మార్గం ఎలా?? ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే...అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక వదిలి పెడుతూ దేహాన్ని వదిలి వేస్తె అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావే అని దుఃఖిస్తూ కొందరు ఉంటే..క్రొత్తగా నువ్వు వస్తున్నావు అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు .. రాక పోకల మధ్య నువ్వు మంచో  చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు . కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బేలెన్స్ చేస్తావు ఆబ్యాగ్ సంచిత కర్మలు ,,అవి పెరిగి పెద్దవి అయి మేరు పర్వతాన్ని మించి కరడు గట్టిన ఓ కొండ గుట్టగా తయారుఅవుతాయి. ‘’అవే ప్రారబ్దం . ఆ ప్రారబ్దం అనే బరువును నెత్తిన పెట్టుకుని ఇపుడు ఈ జన్మ తీసుకుంటావు . ఈ ప్రారబ్దం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు . (సుఖము దుఃఖము.. ఐశ్వర్యము ఆకలి రోదనలు ,,, ఇలా  రెండు ఇనుప బంగారు రెండు సంకెళ్ళే). మరి ప్రారబ్దం కరిగించుకునే మార్గం ?? నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతి కర్మ  నిన్ను అంటుకునే ఉంటుంది. మరి ఇక ఈ దేహం వదిలివేస్తే..అది కరెక్ట్ కాదు. ‘ నీ ప్రారబ్దం నిన్ను వదలదు .  మట్టి కుండలో మంచి నిరు దాహం తీరుస్తుంది . కాబట...

రాశిఫలాలు

 ఈ రోజుటి రాశిఫలాలు        27 JULY 2024 శుక్రవారము జూలై 27 మేషం🐐 అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ) ఆదాయం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. సేవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. వృషభం🐂 కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో) కొన్ని వ్యవహారాలను అతికష్టంపై పూర్తి చేస్తారు.ఆలోచనలు స్థిరంగా ఉండక తికమకపడతారు.ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి.ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు.ఆస్తి వివాదాల తల నొప్పిగా మారవచ్చు.పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.ఉద్యోగ యత్నాలు విరమిస్తారు.కష్టపడ్డా ఫలితం అనుకున్నంతంగా ఉండదు.ఉద్యోగులకు విధి నిర్వహణ కష్టసాధ్యంగా గడుస్తుంది.విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నిరుత్సాహమే.మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మిథునం👩‍❤️‍👨 మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా)ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.ప్రయాణాలలో ఆటంకాలు.కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయ...
  పంచాంగం శనివారం,జూలై27,2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం -  బహుళ పక్షం తిథి:సప్తమి రా1.04 వరకు  వారం:శనివారం(స్థిరవాసరే) నక్షత్రం:రేవతి సా5.27 వరకు   యోగం:సుకర్మ ఉ6.35 వరకు తదుపరి ధృతి తె3.36 వరకు కరణం:విష్ఠి మ2.16 వరకు తదుపరి బవ రా1.04 వరకు వర్జ్యం:ఉ6.16 - 7.45 దుర్ముహూర్తము:ఉ5.40 - 7.22 అమృతకాలం:మ3.13 - 4.42 రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:కర్కాటకం||చంద్రరాశి: మీనం సూర్యోదయం:5.40 || సూర్యాస్తమయం:6.32 సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాక ACCANKSHA YEDUR (M.A (Astro), M.A.(Telugu) , M.A.(E...

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము......!!!

Image
  శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు. ఉండి తీరాలి. ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు, స్త్రీలు, పలకకూడదు.  కానీ ’ఓం’కారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం. పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు – సీతారాములు, లక్ష్మణస్వామి, కాళ్ళ దగ్గర హనుమ. రాముడు అకారానికి ప్రతినిధి,  యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!.  అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతమ్మ. ’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ. అకార ఉకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది. ఆయనకి పూజ చేయడానికి వాళ్ళు చేయవచ్చా? వీళ్ళు చేయవచ్చా? అని అభ్యంతరం ఉండదు. కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది.  రాముడికి ఒక్కడికే రెండు పేర్లు ఉంటాయి. వీర రాఘవ, విజయ రాఘవ. ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. రాముడు ఆర్తత్రాణపరాయణుడు. అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత...

***కన్యాకుమారి క్షేత్ర మహిమ***

Image
కన్యాకుమారి అగ్రము స్వతంత్ర భారతదేశానికి దక్షిణపు కొన-అగ్రము. శుచీంద్రం నుండి పడమటి కనుమలు ఎత్తుతగ్గి, చిన్న గుట్టలుగా మారి కన్యాకుమారి దగ్గరకి వచ్చేసరికి మైదానంగా ఉంటుంది. ఇది దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు. రెండు మహా సముద్రాలను వేరుచేస్తూ హిందూ మహాసముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ప్రపంచంలో మరెక్కడయినా ఉందో లేదో తెలియదు కానీ, ఇక్కడ మాత్రం నిత్యసత్యం - సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం. మూడు సముద్రాలు కలిసి ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో మిళితమై మెరిసే సంధ్యారుణకాంతులు గగనాన ప్రతిఫలించే తీరులు చూస్తేచాలదా జన్మసాఫల్యం! అందించదా జీవితాంతం చిరకాలం గుండెల్లో గూడుకట్టుకుని ఉండే ఆనందానుభూతి? ఈ మహత్తర దృశ్యాన్ని కనులారా చూడటానికి ఎన్నెన్ని దేశాలనుండి, ఎంతెంత దూరంనుంచి, వ్యయానికీ, ప్రయాసకీ ఓర్చి వస్తున్నారు ప్రజలు. ఇది ఎంతో అనాదినుండి అతి పవిత్రమైన స్థానంగా విశేషంగా ప్రశంసించబడి, ప్రస్తుతించబడి ఉన్నది. కన్యాకుమారి ఆలయం సముద్రపు ఒడ్డున భారతదేశ పుణ్యక్షేత్రం మూడు సము...

రేపటి రాశిఫలాలు

Image
  రేపటి రాశిఫలాలు శుక్రవారం, జూలై 26, 2024 మేషం🐐 అశ్వని1,2,3,4,(చూ,చే,చో,లా)భరణి 1,2,3,4,(లీ,లూ,లే,లో) కృతిక 1,(ఆ)నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఊహించనిరీతిలో మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. స్నేహితుల ద్వారా సహాయసహకారాలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. కీలక సమాచారంతో కొంత మనశ్శాంతి పొందుతారు. విద్యార్థులకు అవకాశాలపై కొత్త ఆశలు. మహిళలు కుటుంబ సభ్యుల సలహాలను అనుసరించారు. వృషభం🐂 కృతిక 2,3,4(ఈ,ఊ,ఏ),రోహిణి1,2,3,4(ఓ,వా,వీ,వూ) , మృగశిర1,2,(వే,వో)  ఆదాయం అంతగా కలసిరాక ఏమిచేయలేని స్థితి. ఊహించని విధంగా ప్రయాణాలు.  బంధుమిత్రులతో కొద్దిపాటి మాటపట్టింపులు. కార్యక్రమాలు ఎంతకష్టించినా ముందుకు సాగవు. నిర్ణయాలలో మార్పులు ఉండవచ్చు. ఉద్యోగులకు కొన్ని చికాకులు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.  మహిళలు కీలక విషయాలు తెలుసుకుంటారు. మిథునం👩‍❤️‍👨 మృగశిర 3,4 (కా,కి), ఆరుద్ర 1,2,3,4(కు, ఘ, ఙ, ఛ) పున్వరసు1,2,3(కే,కో, హా) మీ ఆలోచనల పై బంధువుల సానుకూల వైఖరి రావచ్చు. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా ప్రగతి సాధించి...

పంచాంగం

Image
రేపటిపంచాంగం శుక్రవారం, జూలై 26, 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం -  బహుళ పక్షం తిథి:పంచమి ఉ5.56 వరకు  తదుపరి షష్ఠి తె3.29 వరకు వారం:శుక్రవారం(భృగువాసరే) నక్షత్రం:ఉత్తరాభాద్ర రా7.05 వరకు   యోగం:అతిగండ ఉ9.39 వరకు కరణం:తైతుల ఉ5.56 వరకు తదుపరి గరజి సా4.42 వరకు ఆ తదుపరి వణిజ తె3.29 వరకు వర్జ్యం:ఉ5.41 - 7.10 దుర్ముహూర్తము:ఉ8.14 - 9.05 మరల మ12.31 - 1.23 అమృతకాలం:మ2.37 - 4.06 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:కర్కాటకం||చంద్రరాశి: మీనం సూర్యోదయం:5.40 || సూర్యాస్తమయం:6.32 సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. జ్యోతిష రత్న, జ్యోతిష రత్...

బావాలకి సంబందించిన అధిపతులు అనుకూలంగా లేకపోతే......

Image
1వ = ఆరోగ్య సమస్యలు, బలహీనమైన రోగనిరోధక శక్తి, జీవితంలో సాధారణ పోరాటం. 2వ = కుటుంబ సంబంధాలతో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆహారంలో సమస్యలు, చెడు మాటలు. 3వ = తోబుట్టువులతో సమస్యలు, సంభాషణ లోపం, ధైర్యం లేకపోవడం, చిన్న ప్రయాణాలతో సమస్యలు. 4వ = తల్లితో సమస్యలు, సొంత ఇల్లు లేదు.ఇంటిలో చిరాకు 5వ = పిల్లలతో సమస్యలు, స్త్రీలకు గర్భదోషాలు, పురుషులకు సంతాన లోపాలు  ప్రేమలో సమస్యలు. 6వ = వ్యాధి నిరోధకత, నిత్యకృత్యాలు కు ఇబ్బంది ఋణ రోగ శత్రు &చట్టపరమైన కేసుల నష్టం, ఉద్యోగ సమస్యలు. 7వ = సంబంధాలలో సమస్యలు, వివాహం,జీవిత& భాగ్య స్వామి తో సమస్యాత్మక వ్యాపార సంబంధాలు, బలహీనమైన కడుపు. 8వ = ట్రస్ట్ సమస్యలు, భాగస్వామ్యం మరియు భాగస్వామ్యాలతో ఇబ్బందులు, ప్రమాదానికి గురయ్యే అవకాశం. 9వ = వ్యవస్థ సమస్యలు, అదృష్టం లేకపోవడం, తండ్రిని కోల్పోవడం నమ్మండి. 10వ = అధికారం మరియు అన్వేషణ ప్రయోజనంతో సమస్యలు, తండ్రితో సమస్యలు. 11వ = స్నేహాలలో సమస్యలు, అదృష్టాన్ని పొందడంలో ఇబ్బందులు, డబ్బు కష్టాలు. 12వ = ఒంటరిగా ఉన్న అనుభూతి, నష్టానికి సంబంధించిన సమస్యలు, నిద్ర లేదా లైంగిక ఆనందానికి సంబంధించిన సమస్యలు.  సర్వేజనా ...

కలియుగం మొదటి నుంచి దొంగతనమే జరగని గ్రామం గురించి తెలుసా???ప్రపంచంలో అటు వంటి గ్రామం అదొక్కటే!!!

Image
  సాధారణంగా మన వస్తువులను సంపదను భద్రపరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని దానికి తలుపులు వేయిస్తాం. అయితే ప్రపంచంలో ప్రస్తుతం నివాసయోగ్యంగా ఉన్న కేవలం ఒక్క గ్రామంలో మాత్రం ఇళ్ళకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు.  అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ప్రజలను ఇంటికి తలుపులు చేయించడం లేదు. ఇది పది, పదిహేనేళ్ల నాటి సంగతి కాదు. కలియుగం మొదటి నుంచి కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. గొళ్లెం, తాళాల ఊసే లేదు. ఈ గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, దీని విశిష్టతలు తదితర విషయాలకు సంబంధించిన కథనం పాఠకుల కోసం... 1. అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే మహారాష్ట్రలోని, శని శింగనాపూర్ లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు ఆరుబయటనే ఉంటాడు. ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండక పోవడం ఇక్కడ ఉన్న విశిష్టత.  తాను అనంతానంత స్వరూపుడనని ప్రజలకు చెప్పే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి...