Posts

Showing posts from October, 2024

శ్రీ విధాతాపీఠం ఆద్వ్యర్యంలో దీపావళి రోజు అమ్మవారి పూజ

Image
శ్రీ విధాతాపీఠం ఆద్వ్యర్యంలో దీపావళి రోజు అమ్మవారి పూజ   దీపావళి రోజు రాత్రి 12 గంటలకి విధాతపీఠంలో శ్రీ యంత్ర సహిత లక్ష్మికుబేర పూజ ఉంటుంది. పూజలో ఉంచిన పంచలోహ లక్ష్మి కాయిన్ ఇవ్వబడును.. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

రాహు భగవానుడు-రహస్యాలు - Rahu Secrets | Rahu Remedies | Astro Remedies

Image
రాహు భగవానుడు-రహస్యాలు రాహు దశలో మంచి ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి అనేది ఈరోజు తెలుసుకోవచ్చు. రాహు దశ 18 సంవత్సరాలు. ముందుగా రాహు ఏ స్థానంలో ఉన్నారు, మరియు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారు గమనించాలి ఆ నక్షత్ర అధిపతి ఏ స్థానంలో ఉన్నారో రాహువు ఆ ఫలితాలను ఇస్తారు. రాహు ఉన్న నక్షత్రాధిపతి స్వంత రాశి యొక్క ఫలితాలను కూడా రాహు భగవానుడు ఇస్తారు. రాహు దశలో అంతర్దశ రెండు సంవత్సరాల 8 నెలల 12 రోజులు ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దశ జరుగుతున్న కాలంలో జాతకుడు చుట్టూ మోసం చేయడానికి అనేకమంది సిద్ధంగా ఉంటారు. వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు, ఆర్థికంగా లావాదేవీలు జరిపేవారు అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వడం భూ సంబంధమైన లిటిగేషన్ వ్యవహారాలు చాలా సమస్యలుగా మారుతాయి. ఈ రాహు భుక్తిలో జాతకుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న జీవిత కాలానికి సరిపడే సమస్యలలో బంధింపబడతారు. ఉదాహరణకు ఇటువంటి సమయంలో ఒక అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మోసం చేయడానికి అనేకమంది ఈ అమ్మాయి జీవితానికి కనెక్ట్ అవుతారు. ఈ సమయంలో వివాహం చేస్తే ఖచ్చితంగా వివాహం కోలు...

ఆకాశదీప వ్రతారంభం - Akashadeepa Vratham 2024

Image
  ఆకాశదీప వ్రతారంభం : దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కార్తికమాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఈ దీపం వెలిగించరు. కార్తికమాసం (నేటి సాయంత్రం నుంచే కార్తికమాసం ప్రారంభం) ఆరంభం నుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడుసాయంతో ఆకాశదీపం వెలిగిస్తారు. దీనిని చూడడం, వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

కేదారేశ్వర వ్రతం - Kedareswara Vratham 2024

Image
  కేదారేశ్వర వ్రతం : కైలాసంలో పార్వతీ సమేతుడై శివుడు కొలువుతీరి ఉన్నప్పుడు భృంగి శివునికి మాత్రం ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. సరసనే ఉన్న పార్వతీదేవి అదేమి? అని అడిగింది. “బ్రహ్మ జ్ఞానులైన వారికి నీతో పని లేదు కనుక నమస్కరించరు” అని భృంగి సమాధానమిచ్చాడు. పార్వతి అలిగి శివుని నుంచి తన శక్తిని ఆకర్షించుకుని, కైలాసాన్ని వదలి గౌతమాశ్రమం చేరుకుంది. శివుడు శక్తిహీనుడయ్యాడు. ఆశ్రమానికి వచ్చిన అమ్మకు గౌతముడు సత్కారాలు చేశాడు. వచ్చిన పని అడిగాడు. “భర్తతోపాటు గౌరవం పొందాలని భార్యకు ఉండటం సహజంకదా! ఆయన భక్తులకు కూడా నాతో పనిలేదట! ఆయనతో పాటు గౌరవం పొందటానికి మార్గమేమిటని” ప్రశ్నించింది. గౌతముడు కేదారేశ్వర వ్రత విధానం తెలియ చేశాడు. పార్వతి నోము నోచింది. ఉద్యాపన నాటికి శివుడు ప్రత్యక్షమై నాడు. “నేను నీకు అర్థ శరీరం కావాలి. నన్ను కూడా గౌరవిస్తేనే నిన్ను గౌరవించినట్టు. ప్రదక్షిణ ఇద్దరికీ చేయాలే కాని మన మధ్య నుండి చేయకూడదు.” అని వరం అడిగింది పార్వతి. సరే నని తన శరీరంలో సగభాగం ఇచ్చి శివుడు అర్థనారీశ్వరుడయ్యాడు. “ఈ కేదారేశ్వరుని వ్రతం చేసినవారందరూ మనలాగే అన్నింటా చెరిసగం ఉండేలా అనుగ్రహించ వలసింది” అని ...

కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు - Rules To Follow On Karthika Masam

Image
  కార్తీక మాసం .    స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది. కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు . కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను. శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను. ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను. ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది. కార్తీక మాసంలో పండుగలు శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషుల...

శివయ్య ని అమ్మవారు ఎందుకు ముస్తాబు చేసారు.??

Image
కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యాస్తమయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి. అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని ఏర్పరచారు. నెలరోజులూ తులసి సన్నిధి...

కార్తీకమాసం - Karthika Masam 2024

Image
  🌿🌼 రేపటి నుండీ కార్తీకమాసం 🌼🌿 కార్తిక మాసం ఆధ్యాత్మికంగా దివ్యమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం. కనుక 'కార్తిక దామోదర' అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యాస్తమయానికి ముందుగా 'ఆకాశదీపం' పెట్టే సంప్రదాయం ఉంది. హృదయాకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. ఏక భక్తం (ఒంటిపూట భోజనం) ఈ మాసంలో చేయాలి. ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి శివదర్శనం చేయడం శ్రేష్ఠం. శివాలయంలో, విష్ణ్వాలయంలో దీపాన్ని వెలిగించడం మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపం వెలిగించాలి. కార్తికమాసమంతా కార్తిక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. శివుడు 'ఆశుతోషుడు' - వెంటనే సంతోషించే స్వామి. అభిషేక ప్రియః శివః - అన్నారు కనుక ఈ మాసంలో శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను ప్రసాదిస్తుంది. కార్తికమాసం బృందావన యాత్ర, బృందావన పూజ విశిష్టం. బృందావనంలో శ్రీకృష్ణుని ఈ కార్తిక మాసాన ఆరాధించితే బహుశ్రేష్ఠం. దానికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో తులసి కోటను ఆరాధించే విధానాన్ని...

కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది.?? - How Does Karma Works.???

Image
                          కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి . కళ్ళు చెట్టు మీద వున్న పండుని చూశాయి. మనసులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా. అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి పండును కొయ్యటానికి. కాళ్ళు పండుని కొయ్యలేవు, చేతులు పండుని కోశాయి. చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది...!! ఇప్పుడు చూడండి ఎవరు చూసారో వాళ్ళు వెళ్ళలేదు ఎవరు వెళ్ళారో వాళ్ళు తెంపలేదు. ఎవరు తెంపారో వాళ్ళు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్ళు ఉంచుకోలేదు. ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది మరి ఇప్పుడు. ఎప్పుడైతే తోట మాలి చూసాడో అప్పుడు దెబ్బలు వీపు మీద పడ్డాయి, పాపం వీపు తప్పేమీ లేదు, కానీ ఎప్పుడైతే దెబ్బలు వీపు మీద పడ్డాయో అప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. కళ్ళ నుండి, ఎందుకంటే అందరికంటే ముందు, పండుని చూసింది "కళ్ళు".. కాబట్టి.  కర్మ సిద్ధాంతం అంటే ఇదే  ఎవ్వరూ దీన్నించి తప్పించు కోలేరు.. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A ...

మహా అధ్బుతమైన దృశ్యం

  మహా అధ్బుతమైన దృశ్యం.  రెండు తెలుగు రాష్ట్రలలో ఎలాంటి మహా పడిపూజలలో జరగనటువంటి,చూడనటువంటి మహఅద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించిన మన సత్తుపల్లి అయ్యప్పస్వామి దేవాలయ కమిటీ సభ్యులు,నిన్న రాత్రి అయ్యప్ప స్వామి  దేవాలయంలో జరిగిన మహా పడిపూజలో స్వామి వేష ధారణలో 18 పడి మెట్లపై నడిచివస్తూ ఉంటే ఆ మణికంఠుడు భువికి దిగివచ్చినట్లుగా కొద్దీసేపు భక్తులు అందరూ కూడా కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యానికి,తన్మయత్వంనికి లోనైనారు,ఆలయ ప్రాంగణం మొత్తం స్వామి నామాలతో మారిమోగిపొఇంది.🙏స్వామియే శరణం అయ్యప్ప🙏 జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు.??

Image
                    రాశి ప్ర‌కారం …ఏ రంగాన్ని ఎంచుకుంటే స‌క్సెస్ అవుతారు మేషరాశి   వీరి గుణం: వీరికి  తెలివి తేటలు ,పట్టుదల అధికం రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు. కాబట్టి మిలట్రీ, రాజకీయాల‌లో రాణించగలుగుతారు. అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు. వృషభ రాశి వీరి గుణం:  హార్ట్ వర్క్ చేస్తారు. చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు. రాణించ‌గ‌లిగే రంగాలు:  డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు. మిధున రాశి వీరి గుణం:చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. అలాగే తెలివైనవాళ్లు. రాణించ‌గ‌లిగే రంగాలు: టెక్నికల్ వింగ్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు. కర్కాటక రాశి వీరి గుణం: చాలా ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. క్రియేటివిటీ ఎక్కువ‌ రాణించ‌గ‌లిగే రంగాలు: టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్ జాబ్స్లో సక్సెస్ అవుతారు. సింహరాశి   వీరి గుణం: వీళ్లకు భయమంటే తెలియదు. ప్లాన్డ్ గా ఉంటారు. రాణించ‌గ‌లిగే రంగాలు: వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్...

నేటి పంచాంగం(1-11-2024) - Today's Panchangam

Image
 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏          🌿 పంచాంగం 🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ    ...  01 - 11 - 2024, వారం ...  భృగువాసరే ( శుక్రవారం ) శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం - శరదృతువు, ఆశ్వయుజ మాసం -  బహళ పక్షం, తిథి      :  అమావాస్య సా4.45 వరకు, నక్షత్రం  :  స్వాతి తె3.03 వరకు, యోగం :  ప్రీతి ఉ11.25 వరకు, కరణం  :  నాగవ సా4.45 వరకు,                తదుపరి  కింస్తుఘ్నం తె5.38 వరకు, వర్జ్యం                :  ఉ6.47 - 8.33, దుర్ముహూర్తము :  ఉ8.18 - 9.04,                               మరల  మ12.07 - 12.52, అమృతకాలం     :  సా5.21 - 7.07, రాహుకాలం        :  ఉ10.30 - 12.00, యమగండం       :  మ3.00 - 4.30, సూర్యరాశి        ...

దీపావళి శుభాకాంక్షలు - Happy Diwali

Image
  దీపావళి రోజు పఠించాల్సిన లక్ష్మీ స్తోత్రం నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః !! ప్రసన్న ముఖ పద్మాయై పద్మ కాంత్యై నమోనమః నమో బిల్వ వన స్థాయై విష్ణు పత్న్యై నమోనమః విచిత్ర క్షామ ధారిణ్యై పృథు శ్రోణ్యై నమోనమః పక్వ బిల్వ ఫలాపీన తుంగస్తన్యై నమోనమః !! సురక్త పద్మ పత్రాభ కరపాదతలే శుభే సరత్నాంగదకేయూర కాంచీనూ పురశోభితే !! యక్షకర్ధమ సంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే మాంగళ్యా భరణైశ్చిత్రైః ముక్తాహారై ర్విభూషితే !! తాటంకై రవతం సైశ్చ శోభమాన ముఖాంబుజే పద్మ హస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే !! ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతై రాలోక యాబ్దిజే యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః ఫలశ్రుతి ఇతిస్తుతాతథాదేవైః విష్ణు వక్షస్స్థలాలయా విష్ణునా సహసందృశ్య రమాప్రేతావదత్సురాన్ సురారీన్ సహసాహత్వా స్వపధాని గమిష్యథ యే స్థానహీనాః స్వస్థానా ద్ర్భ్రం శితాయేనరాభువి తేమామనే నస్తోత్రేణ స్తుత్వా స్థానమవాప్నుయుః సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బి...

ధన్వంతరి ప్రత్యేకత మీకు తెలుసా.? - Dhanteras

Image
                                                     ధన్వంతరి విశిష్టత  దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది.  అంతే కాదు సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి.   ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు.  శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.  ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.  అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని...

కార్తీకమాసం విశేషాలు - Karthika Masam Special

Image
  కార్తీకమాసం విశేషాలు   నవంబరు 02  స్థిరవారం  నుండి కార్తీక మాసం మొదలవుతోంది.  * నవంబరు 03  ఆదివారం యమవిదియ - భగినీహస్త భోజనం . నవంబర్ 04    మొదటి    కార్తీక సోమవారం * నవంబరు 05, మంగళవారం  నాగుల చవితి * నవంబర్ 11 రెండవ కార్తీక సోమవారం * నవంబరు 12 మంగళవారం ఏకాదశి * నవంబరు 13 బుధవారం  క్షీరాబ్ది ద్వాదశి దీపాలు * నవంబరు 15 శుక్రవారం -  కార్తీకపూర్ణిమ  * నవంబర్ 18 కార్తీకమాసం మూడో సోమవారం * నవంబర్ 25 కార్తీకమాసం నాలుగో సోమవారం * నవంబర్ 26 కార్తీక బహుళ ఏకాదశి * నవంబర్ 29 కార్తీక మాసం మాస శివరాత్రి * డిసెంబర్ 1, ఆదివారం కార్తీక అమావాస్య  * డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి పోలి స్వర్గం ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02, సోమవారం పోలిస్వర్గంతో కార్తీకమాస దీక్ష పూర్తవుతుంది. జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 966660...

నేటి పంచాంగం - Today's Panchangam

Image
  🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻 సోమవారం,అక్టోబర్ 28,2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం తిథి:ఏకాదశి ఉ8.42 వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:పుబ్బ సా5.02 వరకు యోగం:బ్రహ్మం ఉ9.30 వరకు కరణం:బాలువ ఉ8.42 వరకు తదుపరి కౌలువ రా9.36 వరకు వర్జ్యం:రా12.57 - 2.42 వరకు దుర్ముహూర్తము:మ12.06 - 12.52 మరల మ2.24 - 3.10 అమృతకాలం:ఉ10.05 - 11.49 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:తుల చంద్రరాశి:సింహం సూర్యోదయం:5.59 సూర్యాస్తమయం:5.31 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

తిరుమల వివాహ కానుక

Image
  🙏తిరుమల వివాహ కానుక :                               (ఇది పూర్తిగా ఉచితం) మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి రిజిస్టర్ పోస్ట్ పంపండి..  వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది.  దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి) వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది. తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము.. మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసుకి కొరియర్ చేయండి. శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.✍️ To, Sri Lord Venkateswara swamy, The Executive Officer TTD Administrative Building K.T.Road,TIRUPATHI-517501 Tirumala Tirupati Devasthanams(TTD)``` జాతక,ముహూర్త, వాస్తు విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (M.A (Astro)...

తొండం లేకుండా వుండే ఆది గణపతి ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా?

Image
నరముఖ వినాయక ఆలయం    తొండం లేకుండా వుండే ఆది గణపతి ఆలయం ఎక్కడ వుందో మీకు తెలుసా? ఎవరైతే పిత్రుదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవలసిన ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం యొక్క పేరు #తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్నవల్లి సమేత #ముక్తీశ్వారర్_ఆలయం. ఈ ఆలయంలో సాక్షాత్తూ రాములవారు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవటంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టమని చెప్పిన స్థలం. అందుకనే ఈ ఊరిని "తిలతర్పణపురి" అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం. అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది.  #తిలతర్పణపురి  ఇక్కడ రాములవారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో మారటం జరిగింది. అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతూంది. #త్రివేణి_సంగమం ఈ ఆలయం ముఖ్యంగా భ...

ధనత్రయోదశి కుబేరపూజ _ Kubhera Pooja Vidhanam

Image
                                   🌹ధనత్రయోదశి కుబేరపూజ🌹 ఈ భూమిపై మానవుడు ఆటంకాలను జయిస్తూ, ఆనందంగా బతకాలి. అయితే మానవుడు బతకాలంటే ధన సముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడై ఉండాలి. పూర్వం ధనం లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ ధనం కావాలి. అయితే డబ్బును సంపాదించడానికి మానవుడు పడేపాట్లు అంతాఇంత కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేసిన ఉపాయం లేదు. అందుకే మానవ జీవితంలో ధనం నిత్యవసరంగా మారింది. ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. లక్ష్మిధనకనకాధులు, అదృష్టం, సౌందర్యాలనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది అంతకంతే. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొ...

కనకమహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంకోసం

Image
                              🙏🌺ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏 🌺శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం బురుజుపేటలో కొలువు తీరింది పూర్వం ఓపండితుడు కాశీకి చేరుకుని చివరివరకు అక్కడే గడిపి శివసాయుజ్యం పొందాలని బయలుదేరాడు మార్గమధ్యంలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ బావి వద్ద స్నానం ఆచరించాడు బావిలోపల నుంచి ఏదో శబ్దం వినిపించడంతో పండితుడు బావిలో నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని వెలుపలకు తీసి ప్రతిష్టించి పూజలు చేసినట్లు కథనం విశాఖపట్నంలోని బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది ఆలయం చుట్టూ గోడ ఉంది కానీ పైకప్పు లేదు వానకు తడుస్తూ ఆరు బయట అమ్మ కొలువుతీరి ఉంది నడుము పైభాగం వరకు మాత్రమే అంటే చాతి వరకు మాత్రమే అమ్మవారి మూర్తి ఉంటుంది చేతిలో కలువను ధరించి ఉంది భక్తులు అమ్మవారిని స్పర్శించి  నమస్కరించుకోవచ్చు ముఖమండపంలో శ్రీ చక్రం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శించుకోవచ్చు. 🌺 🌺 ఓం శ్రీ ధనలక్ష్మీ నమో నమః  ధన దేవతా స్తోత్రం  నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణ దా...

మీకు తెలుసా.?? -- తిరుమలలో కళ్యాణకట్టకి ఆ పేరు ఎందుకొచ్చింది...?

Image
తిరుమలలో కళ్యాణకట్టకి ఆ పేరు ఎందుకొచ్చింది...? శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి.  ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది. కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది. పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు.   కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది.  నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న ...

నేడు శ్రీ రాధాకుండ ఆవిర్భావం - Today Special

Image
నేడు శ్రీ రాధాకుండ ఆవిర్భావం  అరిష్టాసుర సంహారము తరువాతనే రాధాకుండము, శ్యామకుండము ఆవిర్భవించాయి. ఈ విషయాన్ని ఆచార్యులు మనకు తెలియజేసారు. శ్రీకృష్ణుడు అరిష్టాసుర సంహారము చేసిన తరువాత గోపికలు అతనితో పలుకుతూ “కృష్ణా! అరిష్టుడు అసురుడేయైనా వృషభరూపంలో ఉన్నాడు. కాబట్టి వృషభాన్ని వధించిన పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసికోవాలి. కాబట్టి ముల్లోకాలలో ఉన్న తీర్థాలలో స్నానం చేయనిదే నీవెట్లా పవిత్రుడవు కాగలుగుతావు?” అని అన్నారు. ముల్లోకాలలోని తీర్థాలకు వెళ్ళి స్నానం చేయవలసిన అవసరము తనకు లేదని, వాటినే తన దగ్గరకు రప్పిస్తానని శ్రీకృష్ణుడు పలికి తన కాలిమడమతో నేలను తాకగానే సమస్త తీర్థాలు ఆ దేవదేవుని ముందు ప్రకటమయ్యాయి. అవన్నీ కలిసి శ్యామకుండముగా తయారయ్యాయి. శ్రీకృష్ణుడు దానిలో స్నానం చేసి పవిత్రుడయ్యాడు. “సర్వతీర్థాలు కలిగిన కుండాన్ని నేను సృష్టించాను. మీరు మాత్రం బ్రహ్మదేవుని ప్రీత్యర్థము ఈ ధరణిపై ఎటువంటి ధర్మకార్యము చేయలేదు" అని పలుకుతూ అపుడు శ్రీకృష్ణుడు గోపికలను రెచ్చగొట్టగా రాధారాణికి కోపం వచ్చి శ్యామకుండము కన్నను సుందరమైన కుండాన్ని తాను సృష్టిస్తానని పలికి సఖీబృందముతో కలిసి చేతులతోనే ఒక కుండా...