శ్రీమద్రామాయణము
"" ఆత్మానం మానుషం మన్యే ""
(నేను మానవ మాతృడనే).
ఈ మాటలు స్వయముగ శ్రీరామచంద్ర ప్రభువే చెప్పి యండెను.
అంత మాత్రమున ఆయన నిజముగ మానవ మాతృడేనా ? అనే సందేహము కలుగ వచ్చు.
కారణం.సీతామాత అపహరణ తర్వాత వారు బేలగా సూర్యభగవానునుతో ఇట్లా ప్రాధేయ పడతారు.
"" ఆదిత్య! భో లోకకృతాకతఙ్ఞ
లోకస్య సత్యానృతకర్మసాక్షిన్,
మమ ప్రియా సా క్వ గతా హృతా వా
శంసస్వ మే శోకవశస్య నిత్యమ్.(అరణ్యకాండ 63వసర్గ,16వశ్లో),
ఓ సూర్యా, నీవు కర్మ సాక్షివి.లోకమున జరిగే మంచి చెడులు అన్నీ నీకు తెలుసు.నాకు ప్రియమైన సీతను గురించి శోకమగ్నుడనైన నాకు చెప్పవయ్యా.అని ప్రాధేయ పడటము చూస్తే రాముడు మానవ మాతృడే అని నిర్ధారణ అవుతున్నది.
కానీ ,సీతామాతని రక్షించటములో మృత్యువాత పడ్డ జటాయువుకు అంతిమ సంస్కారాలు చేసిన శ్రీరాముడు జటాయువుకి పునర్జన్మలేని ఉత్తమలోకములు ప్రసాదించినట్లు తెలుస్తుంది
"" మయా త్వం సమనుజ్ఞాతొ గచ్ఛ లోకాననుత్తమాన్,
గృధరాజ! మహాసత్వ! సంస్కృతశ్చ మయా వ్రజ""
(అరణ్యకాండ-68వసర్గ-30వశ్లో)
ఈ
శ్లోకాన్ని గమనిస్తే శ్రీరాముడు మానవమాతృడు అయితే జటాయువుకి మోక్షాన్ని ప్రసాదించే అవకాశము ఉండదుకదా!
మానవ అవతారములో మానవమాత్రుడిగ మెసిలిన అవతారమని శ్రీరాముని గమనించుకోవాలి.ఇవన్నీ నిత్య పారాయణములో మనకి అవగతమవుతాయని గ్రహించుకోగలగాలి.
సర్వేజనా సుఖినో భవంతు
Comments
Post a Comment