మేడి చెట్టు
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
మేడి చెట్టు రూలింగ్ ప్లానెట్ శుక్రుడు, అది దేవత దత్తాత్రేయ స్వామి.
లక్ష్మి నరసింహ స్వామీ హిరణ్య కశిపుడు నీ చంపిన తరువాత చేతి గొర్లు మంట తగ్గడానికి లక్ష్మి దేవి మేడి పండులు, ఆకులు ఉపయోగించి దానిని ఉపశమనం కలుగుతుంది, సదా నేను ఈ మేడి చెట్టు లో నివాస ఉంట అని నరసింహ స్వామి ఇచ్చిన వరానికి కట్టుబడి దత్తాత్రేయ స్వామి రూపం లో అయేనే ఉన్నారు.
జాతకం శుక్రుడు బాగుండక పోతే మొహం కళ విహీనం గా ఉంటుంది, వచ్చిన సొమ్ము నిలవదు, స్రీ శాపాలకు, స్రీ సౌఖ్యం కి శుక్రుడు ప్రధాన కారణం, జీవితం సుఖం గా లేని వారు గురు, శుక్ర బలాలు లేని వారు, సరి అయినా ఫుడ్, సరి అయినా డ్రెస్ దొరకని వారు, శుక్రుడు ఆరాధన చేయాలి,
పూజ చేసే చెట్టు ఆకులు, కొమ్మలు తెంచ కూడదు.
మేడి ఆకులకి గంధం బొట్టు పెట్టీ 9 లేదా 11 లేదా 21 ఆకులు దత్తాత్రేయ స్వామి కి లేదా శివుడికి మాల గా వేస్తే పదోన్నతి లభిస్తుంది.
మేడి చెట్టు మొదట్లో పసుపు నీళ్ళు పోస్తే గురు బలం పెరుగుతుంది...మంగళ కార్యాలు జరుగుతాయి..
మేడి చెట్టు మొదట్లో గంధం నీరు పోస్తే దరిద్ర నాశనం, ధనఆకర్షణ..
మేడి చెట్టు మొదట్లో 2 మేడి ఆకులు మీద అవు నెయ్యి తో దీపం పెట్టీ 16 ప్రదక్షిణాలు చేస్తే బ్రాహ్మణుడి నీ, దేవతలని నిందించిన దోషం పోతుంది.
మేడి చెట్టు మొదట్లో 2 ఆకుల మీద అవాల నూనె తో దీపం పెట్టీ 16 ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మి వృద్ధి, స్రీ శాపాలు దూరం అవుతాయి..
మేడి పండులు చూర్ణం గోరు వెచ్చని నీటితో కలిపి తాగితే రక్త హీనత తగ్గి చర్మం కాంతి వంతం గా మెరుస్తుంది..
కడుపులో పుండ్లు, రక్తం కారడం, మంట, ulcerative colitis, ఉంటె మేడి చెట్టు ఉత్తరం లేదా తూర్పు వైపు పెరిగిన వేరు చెట్టు నుండి వేరు చేయకుండా మట్టి తొలగించి భక్తి తో నమస్కారం చేసుకుని ఆ వేరు వాటర్ లో కొంచం సేపు పెట్టీ ఆ నీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది..
మేడి చెట్టు పెట్టీ బ్రతికే వరకు సంరక్షణ చేసిన వారికి సర్వ సుఖాలు అనుభవిస్తాడు,...
సర్వేజనా సుఖినో భవంతు
Comments
Post a Comment